ఎస్ఐ రాసలీలలు: రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
మరో యువతితో వెంకట్ రెడ్డి ఉండటం చూసిన మొదటి భార్య, ఆమె బంధువులు ఆ యువతిపై దాడికి యత్నించారు. తన భర్త బేగం బజార్లో ఎస్ఐగా పని చేస్తారని, ఆయన కొంతకాలంగా మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, దీనిని తాను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని మొదటి భార్య చెప్పారు. అయితే ఇది అబద్దమని, తాను ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్ఐ చెబుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
భర్త అరెస్ట్.. పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పరిగి మండలం నష్కల్లో విషాదం చోటు చేసికుంది. తన భర్తను పోలీసులు అరెస్టు చేశారనే మనస్తాపంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ దొంగతనం కేసులో రాజు అనే వ్యక్తిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అతని భార్య లక్ష్మిని కూడా శనివారం ప్రశ్నించారు.
దీంతో ఆమె మనస్తాపానికి గురైంది. దొంగతనం కేసులో పోలీసులు తనను, తన భర్తను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పిల్లలతో కలిసి బావిలోకి దూకింది. మృతదేహాలను స్థానికులు ఉదయం బయటకు తీశారు. మృతురాలి బంధువులు కూడా పోలీసుల వేధింపుల వల్లనే ఆమె మృతి చెందిందని ఆరోపిస్తున్నారు.