50మందితో పెళ్లా: కేరళ లేడీ కిలాడికి కోపమొచ్చింది
యాభై మంది వరకు యువకులతో ప్రేమాటలాడి భారీ మొత్తంతో ఉడాయించిన కేరళ లేడీ నేపథ్యంపై పోలీసులు చెప్పిన వివరాల... కేరళ రాష్ట్రం కేశవపురానికి చెందిన షహనాజ్ గత పదకొండేళ్ల క్రితం సిద్ధిక్ అనే కేరళ యువకుడిని వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఓ సంతానం కూడా కలిగింది. తరచూ భర్తతో విభేదిస్తూ అతనికి దూరమైన షహనాజ్ అక్కడే తన ప్రేమ నాటకానికి తెరదీసింది. తొలుత కేరళకు చెందిన ఓ యువకుడితో ప్రేమాయణం జరిపిన సహానా అతనిని వదిలేసి చెన్నయ్ రైలేక్కెసింది.
2006 సంవత్సరంలో మద్రాసు నగరంలోకి అడుగుపెట్టిన సహానా శ్రీపెరంబదూరు సమీపంలో నివాసముంటూ ఆ ప్రాంతానికి చెందిన మణికంఠ న్అనే వ్యక్తిని కల్లబొల్లి మాటలతో తన వలలో వేసుకుంది. అతన్ని రహస్య వివాహం చేసుకున్న సహానా ఐఏఎస్ ప్రిపరేషన్ పేరుతో సైదాపేటలోకి మకాం మార్చింది. అప్పటి నుంచి కనిపించిన యువకులపై ప్రేమ వల విసరడం అందినకాడికి దక్కించుకోవడం ఆపై తన దారి తాను చూసుకుంటూ పలు మోసాలకు పాల్పడింది.
ఈ క్రమంలో పలువురు యువకులను పెళ్లాడి వారం, పదిరోజుల పాటు కాపురం కూడా చేసింది. ప్రస్తుతం ఎవ్వరితోనూ లేకుండా ఒంటరిగా వుంటున్న షహనాజ్ ఎక్కడ ఉన్నది ఎవ్వరికీ తెలియక పోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఆమె గుట్టు రట్టు కావడం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫోన్ నెంబర్లలో పోలీసులు సంప్రదించినప్పుడు పలు మార్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో షహనాజ్ ఫోన్లో పోలీసులకు దొరికింది.
ఆమెతో మాటలు కలిపిన పోలీసులు వివరాలు ఆరా తీయగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్క మహిళ యాభై మందిని ప్రేమించి పెళ్లి చేసుకోగలదా? అర్ధం పర్థం లేకుండా నిందలు మోపుతారా? అంటూ పోలీసులనే నిలదీసినంత పని చేసింది. నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఇదంతా చేస్తున్నారు. ఇక తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఫోన్ను కట్ చేసింది. కాగా షహనాజ్ యాభై మంది వరకు కాక పోయినా పదిహేను మందికి పైగా పెళ్లి చేసుకొని మోసగించి ఉండవచ్చునని తెలుస్తోంది.