సింగ్తో లక్ష్మీనారాయణ భేటీ: జగన్ కేసు పురోగతి పైనే!
కాగా జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారం వాయిదా పడ్డాయి. తమ లాయర్లు అందుబాటులో లేరని, సమయం కావాలని డిఫెన్స్ కోరడంతో కేసు వాయిదా పడింది.
బెయిల్ డీల్ కేసులో వాదనలు వాయిదా
మరోవైపు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ డీల్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్ల వాదనలు వాయిదాపడ్డాయి. ఈ కేసులో మాజీ జడ్జి పట్టాభి రామారావు మూడోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్తో పాటు కంప్లి ఎమ్మెల్యే సురేష్బాబు, దశరథరామి రెడ్డి పిటిషన్లపై సోమవారం వాదనలు జరిగాయి. డిఫెన్స్ వారి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎసిబి తరపు న్యాయవాదికి సూచిస్తూ తదుపరి వాదనలను మంగళవారానికి వాయిదా వేశారు.
ప్రత్యేక ఖైదీలుగా పరిగణించాలంటూ సోమ శేఖర రెడ్డి, సురేష్ బాబు వేసిన పిటిషన్లను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. గాలి బెయిల్ డీల్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాచారం రౌడీషీటర్ యాదగిరి రావు మొదటిసారిగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే డిఫెన్స్, ఎసిబి వాదనలు పూర్తయిన పట్టాభి కుమారుడు రవిచంద్ర, మాజీ న్యాయమూర్తి చలపతి రావు బెయిల్ పిటిషన్లపై తీర్పు మరోమారు వాయిదా పడింది.