రాజీనామా ఎందుకు చేయాలి: బిజెపిపై మండిపడ్డ సింగ్
ప్రతిపక్షాలకు తన మౌనమే సమాధానమని, తాను మాట్లాడనని, రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. తాను ఎందుకు రాజీనామా చేయాలని ఎదురు ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి యత్నిస్తోందని, అధికారం చేజిక్కించుకునేందుకే ఇలా చేస్తోందని విమర్శించారు. బిజెపి సాధారణ ఎన్నికల వరకు ఆగాలని ఎద్దేవా చేశారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు.
అభివృద్ధి రేటుపై నీచ రాజకీయాల ప్రభావం పడుతోందని, అధికార దాహంతోనే బిజెపి పని చేస్తోందని విమర్శించారు. సమావేశాలను సక్రమంగా జరగనివ్వడం లేదన్నారు. ఈ కారణంగానే సెషన్స్ సరిగా జరగటం లేదన్నారు. అస్సాం అల్లర్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లర్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్త దెబ్బ తిన్నదన్నారు.
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని తాను మంత్రివర్గంలోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. లోక్పాల్ పరిధిలోకి ప్రధానమంత్రిని తీసుకు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. నామ్ సమావేశాలకు హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ టెహ్రాన్లో బిజెపిపై ఎదురు దాడికి దిగారు.