రక్షించేందుకు జగన్తో సిఎం ఒప్పందం: ఎర్రన్నాయుడు
ఆదివారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో జగన్పై తీవ్ర విమర్శలు చేసిన ముఖ్యమంత్రి, పిసిసిఅధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు జగన్ ప్రస్తావన చేయటం లేదని ప్రశ్నించారు. ఇదంతా కాంగ్రెస్ - జగన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. జగన్ ఎప్పటికైనా కాంగ్రెస్లో కలిసిపోతారని జోస్యం చెప్పారు. మాజీ మంత్రి శంకర రావు, తాను వేసిన పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన నోటీసులకు కౌంటర్ ఇవ్వని ప్రభుత్వం, ఇప్పుడు మంత్రుల కోసం ప్రజాధనాన్ని ఎందుకు ఖర్చు చేస్తోందని ప్రశ్నించారు.
నిజానికి ఇదంతా జగన్ను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకమని విమర్శించారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించటంలో జాప్యానికి కారణమేమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా అణగదొక్కుతోందని విమర్శించారు. రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఆజాద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి ఇంటికెళతారన్న భావన ఏర్పడిందని, అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి బెదిరింపులకు లొంగుతున్నారన్నారు. అవినీతి కేసులో జగన్ను రక్షించేందుకు కిరణ్ అతనితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. ధర్మాన రాజీనామా చేయడం, ఢిల్లీ వెళ్లడం, తిరిగి రావడం ఇదంతా ఓ హైడ్రామా అన్నారు. నైతిక విలువలు ఉంటే ఎప్పుడో రాజీనామా ఆమోదింప చేసుకునే వారన్నారు. కృష్ణా డెల్టా భూములు ఎండిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.