కృష్ణా జలాలు డెల్టాకే ముందు: వడ్డే శోభనాద్రీశ్వర రావు
అయినా 160 సంవత్సరాల చరిత్ర కలిగిన కృష్ణా డెల్లాలో ఖరీఫ్లో వరి తప్ప ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య వైషమ్యాలతో... ఇప్పటికే ఢిల్లీల్లో రాష్ట్రం మాటకు చెల్లుబాటు లేకుండా పోయి... రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు. ఈ వైఖరిలో మార్పు రాకపోతే... మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేవారు.
ముఖ్యమంత్రి సైతం ఒక ప్రాంతానికి వ్యక్తిగా గాకుండా రాష్ట్రానికి సీఎం అన్న గురుతర బాధ్యతగా మెలగాలని అన్నారు. కొందరు పెద్దలు రాజకీయాలకు పోతూ ప్రాంతాల మద్య వైషమ్యాలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. అయితే తాము ఏ ప్రాంతానికి సైతం నీరు ఇవ్వవద్దని చెప్పడం లేదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో నిర్మించే ప్రాణహిత-చేవెళ్ల, కాంతాలపల్లి ప్రాజెక్టులకు తాము ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.
ప్రభుత్వం సైతం ట్రిబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించలేకపోయిందన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే.. రాబోయే తరాలకు న్యాయం చేసిన వారం అవుతామని అన్నారు. కనీసం వచ్చే జూన్ నాటికైనా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు.