గీతిక ఆత్మహత్య: తార నూపుర్కు పోలీసు క్వొశ్చన్స్
గీతికా శర్మ ఆత్మహత్య కేసు ఇప్పటికే పలు మలుపులు తీసుకుంది. నూపుర్ మెహతా వెల్లడించే విషయాలు దర్యాప్తులో కీలకమవుతాయని పోలీసులు భావించారు. ఈ కేసులో నిందితుడైన హర్యానా మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందా, అంకితా సింగ్కు గల సంబంధంపై, వారికి కలిగిన సంతానంపై తొలిసారి బయటపెట్టింది నూపుర్ మెహతానే. సూసైడ్ నోట్లో గీతికా శర్మ అంకిత పేరును కూడా ప్రస్తావించింది.
కందాకు చెందిన ఎండిఎల్ఆర్ ఎయిర్లైన్స్లో పనిచేసిన నూపుర్ మెహతాకు కందాతో సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్నారు. ఆమెకు కందా ఫ్లాట్, నగదు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంకితకు, గీతికకు మధ్య గొడవ జరిగిందని, అంకిత గీతిక అపార్టుమెంటులోకి చొరబడి లాప్టాప్, పాస్పోర్టు, సంచీ తీసుకుని వెళ్లినట్లు కేసు నమోదైనట్లు ఆమె చెప్పింది.
23 ఏళ్ల గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆయన 11 రోజుల పాటు పరారీలో ఉన్నారు. గీతికా శర్మ ఆగస్టు 5వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దానికి ముందు రాసి పెట్టిన సూసైడ్ నోట్లో ఆమె కందాపై, ఆయన ఉద్యోగిని అరుణా చద్ధాపై ఆరోపణలు చేసింది.