నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు: ఎంపి మేకపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
నెల్లూరు/ హైదరాబాద్: సిబిఐ కుట్రపూరితంగా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఇరికించిందని నెల్లూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఆరోపించారు. వైయస్ జగన్‌ నిర్ధోషిగా త్వరలోనే బయటకు వచ్చి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్‌ ఆస్తులపై సిబిఐ పూటకో మాట మాట్లాడుతోందని, తెలుగుదేశం పార్టీ పొరపాటున నిజం చెప్పినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని ఉదయగిరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు పాదయాత్ర ఆలోచన పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మరన్నారు.

తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖఱ రావు రెడీ అవుతున్నారని ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు మండిపడ్డారు. ఆర్థిక లావాదేవీల కోసమే కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారని ఆయన శనివారమిక్కడ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ రాజకీయం అంతా కుటుంబ సంక్షేమం కోసమేనన్నారు.

వాయలార్‌ దగ్గరకు మిగతా నేతలను తీసుకెళ్లకుండా తన కుమారుడు కెడటి రామారావునే కేసీఆర్‌ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానికి ఒప్పుకోవడమంటే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయటమేనని గోనె ప్రకాశరావు అన్నారు.

English summary
YSR Congress MP Mekapati Rajamohan reddy said that YS Jagan will come out of the jail clean. He alleged that CBI has hatched conspiracy against YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X