వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల: ఇవో, చైర్మన్ మధ్య కంకణధారణ కలహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kanumuri Bapiraju
తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల 'కంకణ ధారణ' కలహానికి దారితీసింది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య మనస్పర్థలకు దారితీసింది. చివరకు ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లింది.

సాధారణంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమానికి ముందుగా శ్రీవారి బంగారు వాకిలి వద్ద టిటిడి ఈవో కంకరణధారణ చేస్తారు. అప్పటి నుంచి ఆయనే ఉత్సవాలను దగ్గరుండి నడిపిస్తారు. ఈ కంకణధారణ చేసిన తర్వాత బ్రహ్మోత్సవాలు పూర్తయ్యేంత వరకు తిరుమల పొలిమేరలు దాటి వెళ్లకూడదనే నిబంధన ఉంది. ఈ ఆచారం అనాదిగా వస్తోంది.

అయితే, టిటిడి ఛైర్మన్‌లు కంకణ ధారణ చేసినా గతంలో కొందరు ఇవోలు పట్టించుకోలేదు. మరికొందరు ఈ ఆచారాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాత్రం గత యేడాది అప్పటి టిటిడి ఈవోను ఒప్పించి తాను కూడా కంకణధారణ చేసుకున్నారు.

ఈ యేడాది కూడా ఈయనే ఛైర్మన్‌గా నియమితులు కావడంతో మళ్లీ కంకణధారణ చేయించుకునేందుకు ఆసక్తి చూపారు. ఈ విషయం తెలిసిన ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సమ్మతించ లేదు. అయితే, రాజకీయ పలుకుబడిన కలిగిన కనుమూరి ఈవోను పక్కనబెట్టి కంకణధారణ చేయించుకున్నారు. ఇది ఇరువురి మధ్య మనస్పర్థలకు దారితీయడంతో ఈ కార్యక్రమానికి ఈవో దూరంగా ఉన్నారు.

ఈ విషయం చివరకు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన పంచాయతీతో ఈవో శాంతించి బ్రహ్మోత్సవాల్లో పాలుపంచుకుంటున్నట్టు సమాచారం.

English summary
Differences cropped up between Tirumala Tirupathi Devasthanam (TTD) EO LV subrahmniam and chairman Kanumuri Bap-iraju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X