ట్యాంక్బండ్పై కవిత ధర్నా, శ్రీకృష్ణపై కోదండరామ్ ఫైర్
ఓ కమిటీ వేసి తెలంగాణ మహనీయుల విగ్రహాలను కూడా ప్రతిష్టించాల్సిందని ఆమె అన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాలను ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించింది. ప్రభుత్వం తిరిగి నెలకొల్పిన విగ్రహాల్లో గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, సర్ ఆర్థర్ కాటన్వి ఉన్నాయి. ధ్వంసమైన విగ్రహాలను పది రోజుల్లో తిరిగి ప్రతిష్టిస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
కాగా, తెలంగాణపై అధ్యయనానికి ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణ సమాజం ఇచ్చిన సమాచారాన్ని జస్టిస్ శ్రీకృష్ణ తన నివేదికలో పొందుపరచలేదని ఆయన శుక్రవారం విమర్శించారు. వేల కొద్ది పేజీల సమాచారాన్ని ఇచ్చినా పట్టించుకోకపోవడం వల్లనే శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ సమస్యకు పరిష్కారాన్ని చూపలేకపోయిందని ఆయన మీడియాతో అన్నారు.
నివేదికలో ఎనిమిదో అధ్యాయాన్ని ఎందుకు రాశారో జస్టిస్ శ్రీకృష్ణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ మార్చ్కు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలను గత రెండు రోజులుగా కలుస్తున్న తెలంగాణ జెఎసి నేతులు శుక్రవారం తెలంగాణ నగారా సమితి నేతలను కలిశారు. మార్చ్ను విజయవంతం చేసినందుకు వారు నాగం జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.