వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నేతలు పొలిటికల్ జోకర్లు పవర్ బ్రోకర్లు: కడియం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadiyam Srihari
వరంగల్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ నేతలు పొలిటికల్ జోకర్లు.. పవర్ బ్రోకర్లు అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు. ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమాన్ని కిందిస్థాయిలో బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారన్నారు.

రాజీలు, రాయబారాలతో తెలంగాణ రాదన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందన్నారు. అన్ని పార్టీల వారు కలిసి ఉద్యమిస్తే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిగి వచ్చి తెలంగాణ ఇస్తుందన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కనుసన్నుల్లో మెదులుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ఏర్పాటును కోరుతూ అన్ని పార్టీలు కేంద్రానికి అఖిలపక్షాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం కూడా తెలంగాణను ఇంకా నాన్చడం సరికాదన్నారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు.

కేంద్రం అఖిలపక్షం ఏర్పాటు చేసి ఒక్క పార్టీ నుండి ఒక్కరికే అనుమతివ్వాలని ఆయన సూచించారు. మంత్రులు రాజీనామా చేస్తే ఒక్కరోజులో తెలంగాణ వస్తుందని కడియం శ్రీహరి చెప్పారు. కాగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రీయ జనతా దళ్‌ను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపైనే కడియం మాట్లాడుతూ నీరుగార్చుతున్నారని మండిపడ్డారు.

English summary

 Telugudesam party senior leader Kadiyam Srihari has blamed that Congress leaders are political jokers and power brokers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X