వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పింక్ రిబ్బన్ వాక్లో మోహన్ బాబు, వివిఎస్, అమల
ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున సతీమణి అమల, ప్రముఖ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తదితర సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కెబిఆర్ పార్క్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదిగా తిరిగి కెబిఆర్ పార్క్కు చేరుకుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా వీరు రెండు కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. అందరూ వ్యాధుల పైన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు అయినప్పటికీ వ్యాధుల గురించి మాట్లాడుకోవడంలో తప్పు లేదన్నారు. రొమ్ము క్యాన్సర్ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకోవాలని మోహన్ బాబు ఈ సందర్భంగా సూచించారు. అనంతరం అమల మాట్లాడుతూ... రొమ్ము క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
English summary
Cine actor Mohan Babu, actress Amala and former cricketer VVS Laxman participated in Pink Ribbon walk on Sunday to alert people on breast cancer.
Story first published: Sunday, October 7, 2012, 13:30 [IST]