ముంబైలో భారీ సెక్స్ రాకెట్ రట్టు: 116 మందికి విముక్తి
అందులో 26 మంది మైనర్ బాలికలు కూడా ఉన్నారన్నారు. రెస్క్యూ ఫౌండేషన్ అనే మరో స్వచ్ఛంద కూడా ఇందుకు సహకరించిందన్నారు. ఇదే విషయమై పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. అయితే తాము దాడి జరిపిన ప్రతిసారీ అక్కడి నుంచి వెళ్లిపోతున్నారని, తిరిగి వస్తున్నారన్నారు. తుర్భేలో వ్యభిచారం జరుగుతున్న ప్రాంతం చాలా దూరంగా ఉంటుందని, దానిచుట్టూ కొండలు ఉంటాయన్నారు.
అందువల్ల ఇక్కడికి తరలించిన మహిళలు తప్పించుకోవడం ఎంతో కష్టమన్నారు. ఒకవేళ ఎవరైనా తప్పించుకుందామని ప్రయత్నించినా సులువుగా దొరికిపోతారన్నారు. దీంతో నిర్వాహకులు వారిని తిరిగి బలవంతంగా ఈ రొంపిలోకి దింపుతున్నారన్నారు. అక్కడ ఆవాసాలు కూడా తక్కువగా ఉంటాయన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో నివసించేవారికే దీని గురించి తెలుస్తుందన్నారు.
లైంగిక వేధింపు కేసులో రెండేళ్ల జైలు శిక్ష
యజమాని మైనరు కూతురును లైంగిక వేధించిన కేసులో నగర కోర్టు ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. టీకొట్టులో పని చేసే ఓ ఉద్యోగి యజమాని ఐదేళ్ల కూతురును లైంగిక వేధించినట్లు నిరూపణ అయిందని పేర్కొంటూ అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి మధు జైన్ ప్రకటించారు. నిందితునిపై ఉన్న అత్యాచార ఆరోపణల నుంచి మాత్రం విముక్తి కల్పించారు. విచారణ సమయంలోనే దోషి ఆతిక్ ఆలం రెండేళ్లుగా జైలులో ఉన్నందున, అతడిని విడుదల చేయాలని ఆదేశించారు.