తెలంగాణ తప్ప: డికె అరుణ, షిండేపై పాల్వాయి ఫైర్
అందరు నేతలతోనూ తమకు తెలంగాణ తప్ప ఎలాంటి ప్యాకేజీ ఇతరత్రా వద్దని చెప్పామన్నారు. బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసినట్లు చెప్పారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కూడా కోరామన్నారు. అలాగే వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. జడ్చర్ల నుండి రైల్వే లైన్ వేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్ను పునరుద్దరించే చర్యలు చేపట్టాలని చెప్పామన్నారు.
షిండే తెలుసుకొని మాట్లాడాలి.. పాల్వాయి
కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. చర్చల ప్రక్రియ సంగతి తెలుసుకోకుండానే ఆయన మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు. షిండే వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని విమర్శించారు.
తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో గత కొంతకాలంగా తెలంగాణపై చర్చలు జరుపుతోందన్నారు. సిడబ్లుసి సభ్యులు కూడా చర్చల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కెసిఆర్తో జరుపుతున్న చర్చలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని అన్నారు.