బాబు పాదయాత్ర: సాక్షి విలేకరిపై తెలుగుదేశం దాడి!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఇది జరిగినట్లుగా తెలిపింది. బెళుగుప్ప మండల కేంద్రంలో బుధవారం చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు స్థానిక టిడిపి నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, అయితే అక్కడున్న దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపించకుండా అడ్డంగా ఈ ఫ్లెక్సీలు కట్టారని తెలిపింది.
దీనిని చూసిన స్థానిక సాక్షి విలేకరి ఫోటో తీస్తుండగా టిడిపి నేతలు గమనించారని, దీంతో వారి ఆగ్రహంతో ఊగిపోయి అతనిపై మూకుమ్మడి దాడికి దిగారని ఆరోపించారు. ఆయనను దుర్భాషాలాడుతూ కెమెరాను లాక్కున్నారని, ఇదంతా చూస్తున్న పోలీసులు కూడా నిందితులను వదిలేసి విలేకరిని స్టేషన్లో కూర్చోబెట్టారని ఆరోపించింది.
సాక్షి విలేకరి అనిల్ కుమార్ పైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు, ఎపియుడబ్ల్యుజె డిమాండ్ చేశారు.