హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ హోదాలో జూ.ఎన్టీఆర్, బాలయ్య ప్రచారం: మేకపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తలపెట్టిన పాదయాత్రపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏ హోదాలో సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు.

షర్మిల పాదయాత్రకు చంద్రబాబు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజన్న పాలన తెస్తామని తాము ప్రజలకు ధైర్యంగా చెప్పగలమని, తన పాలన తెస్తానని చంద్రబాబు ప్రజలకు ధైర్యంగా చెప్పగలరా అని అన్నారు. వైయస్ జగన్‌ను నిర్బంధించి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పబ్బం గడుపుకుంటున్నాయని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ నాయకురాలు శోభారాణి తీవ్రంగా మండిపడ్డారు. సెంటిమెంట్ ఓట్ల కోసం వైయస్ జగన్ జైలులోనే ఉండాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోరుకుంటున్నారని ఆమె శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇంతటి దిగజారుడు స్థితిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.

ప్రజాసమస్యల కోసం నాయకులు పాదయాత్రలు చేస్తుంటారని, అయితే ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదనే కారణంతో పాదయాత్ర చేస్తామని అనడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే చెల్లిందన ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కథనాలు పంచటమే లక్ష్యంగా సాక్షి పత్రిక, టీవీ చానెల్ పనిచేస్తున్నాయని శోభారాణి విమర్శించారు.

English summary
YSR Congress party MP Mekapati Rajamohan Reddy questioned in what capacity cine heroes Balakrishna and Jr Ntr campaigned for Telugudesam in elections. He said that TDP president Chandrababu Naidu is fearing of Sharmila's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X