వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోచుకున్న జగన్‌కోసం షర్మిల యాత్ర: ఈటెల, బాబుపై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etela Rajender
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రలను ప్రజలు ఎవరూ నమ్మరని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ఆదివారం అన్నారు. ఇన్నాళ్లూ ప్రజల సమస్యలు పట్టించుకోని షర్మిల ఇప్పుడు తన అన్న జగన్ కోసం మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రకు సిద్ధమయ్యారన్నారు.

దోపిడీ సొమ్మును కాపాడుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే జగన్ వలె దోచుకున్న వ్యక్తి మరొకరు లేరని నిప్పులు చెరిగారు. అధికారం కోసమే జగన్ పార్టీ పాదయాత్రకు సిద్దమయ్యారన్నారు. చంద్రబాబు కూడా తన తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సంక్షేమంపై దృష్టి సారించలేదన్నారు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఇప్పుడు జనాల్లోకి వస్తే ప్రజలు బాబును, షర్మిలను నమ్మరన్నారు. బాబుది దొంగ యాత్ర అన్నారు.

ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించరన్నారు. వారిద్దరి యాత్ర అధికారంలోకి వచ్చేందుకే తప్ప ప్రజల కోసం కాదన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేసింది తామేనని, తమకు ఐకాసతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని కాంగ్రెసు చెప్పడం సరికాదన్నారు. ఏకాభిప్రాయం అంటూ జపం చేస్తే కుదిరే పని కాదని, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెసు లేకుండా పోయిందన్నారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తెలంగాణ ప్రకటిస్తే మంచిదన్నారు.

English summary
TRSLP Etela Rajendar has lashed out at YSR Congress party cheif and Kadapa MP YS Jaganmohan Reddy on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X