నటి హేమశ్రీ మిత్రుడ్ని ప్రశ్నించిన పోలీసులు
హేమశ్రీ హత్య కేసులో బెంగళూరు పోలీసులకు అనంతపురం జిల్లా పోలీసులు సహకరిస్తున్నారని చెబుతున్నారు. అయితే హేమ భర్త సురేంద్ర బాబు మాత్రం సహకరించట్లేదని వార్తలు వస్తున్నాయి. కాగా,హత్యకు గురైన నటి హేమాశ్రీకి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేస్తామని బెంగుళూరు అదనపు పోలీసు కమిషనరు సునీల్ కుమార్ తెలిపారు.
హేమాశ్రీ జీర్ణాశయంలో కొన్ని ద్రవాలు కనిపించినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆ ద్రవాలు ఏమిటనేది తెలుసుకోవడానికి పరీక్ష కోసం ఫోరెన్సిక్ల్యాబ్కు పంపారు. మరో రెండు రోజుల్లో ఈ నివేదిక వస్తుందని చెపుతున్నారు. హేమశ్రీ భర్త సురేంద్ర బాబు కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైవర్ కోసం బెంగుళూరు, ఆంధ్రప్రపదేశ్, కొడైకెనాల్, ఊటీల్లో గాలిస్తున్నట్లు తెలిపారు.
ఏం అడిగినా హేమశ్రీ భర్త సమాధానం ఇవ్వకుండా ఏడుస్తున్నట్లు చెబుతున్నారు. హేమశ్రీ తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురం జిల్లా రాజకీయ నాయకుల పాత్రపై పలు వార్తాకథనాలు వస్తున్నాయి. అవన్నీ ఏ మేరకు నిజమనేది పోలీసు విచారణలో తేలాల్సింది.