హేమశ్రీపై రేప్ జరగలేదు, క్లోరోఫాం వల్లనే: పోలీసులు
కాగా నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.