సత్యం కేసులో ఈడి దూకుడు: రూ.822 కోట్లు అటాచ్
కాగా అంతకుముందు రెండు నెలల క్రితం రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్(సిబిఐ)కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యం రామలింగ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన 1063 ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి అటాచ్మెంట్కు కోర్టు సిబిఐకి అనుమతించింది. ఆంధ్ర ప్రదేశ్తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది.
Comments
satyam scam ramalinga raju mahindra satyam ed ys jagan hyderabad సత్యం కుంభకోణం రామలింగ రాజు ఈడి వైయస్ జగన్ హైదరాబాద్
English summary
Enforcement Directorate attaches properties valued at Rs.822 crore of Satyam founder B.Ramalinga Raju.
Story first published: Thursday, October 18, 2012, 13:45 [IST]