హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం కేసులో ఈడి దూకుడు: రూ.822 కోట్లు అటాచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్/న్యూఢిల్లీ: సత్యం కుంభకోణం కేసుకు సంబంధించి రూ.822 కోట్ల ఎఫ్‌డిలను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) జప్తు చేసింది. ఈడి చరిత్రలో దేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తిని జఫ్తు చేయడం ఇదే ప్రథమం. ఈ మొత్తం సత్యం ఖాతాలోనివి. ఈడి రూ.822 కోట్లను జప్తు చేసినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.

కాగా అంతకుముందు రెండు నెలల క్రితం రామలింగ రాజుకు చెందిన రూ.120 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్‌మెంటుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిసేషన్(సిబిఐ)కి కోర్టు బుధవారం అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. రామలింగ రాజు ఆస్తుల కేసు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల అటాచ్‌మెంటుకు అనుమతివ్వాలని సిబిఐ ఇటీవల సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐకి అటాచ్‌మెంట్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సత్యం రామలింగ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల పైన 1063 ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటన్నింటి అటాచ్‌మెంట్‌కు కోర్టు సిబిఐకి అనుమతించింది. ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో సత్యం రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది.

English summary
Enforcement Directorate attaches properties valued at Rs.822 crore of Satyam founder B.Ramalinga Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X