బెంగళూర్ బార్ గర్ల్స్పై సామూహిక రేప్, ఎందరిపై?
ఈ కేసులో సుమారు పదిమంది అత్యాచారానికి పాల్పడ్డారని, వారంతా ఇరవై నాలుగేళ్ల లోపు వారేనని కమిషనర్ తెలిపారు. ఉత్తర భారత దేశానికి చెందిన ఎనిమిది మంది యువతులు ఈ ఇంట్లో నివసించేవారని.. వీరంతా గాంధీనగర్లోని ఓ బార్లో పని చేస్తున్నారని ఆయన తెలిపారు. వీరి రాకపోకలను క్షుణ్ణంగా గమనించిన స్థానికులే అత్యాచారానికి పాల్పడి వుండవచ్చునని ఆయన పేర్కొన్నారు.
దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల వారి వివరాలు వెల్లడించలేమని చెప్పారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఎందరిపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ సంఘటనలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నామని.. మిగిలినవారిని అరెస్ట్ చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు నగర కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జీ వెల్లడించారు.
నేపాలి విద్యార్థినిపై అత్యాచారం కేసులో అరెస్ట్
సంచలనం సృష్టించిన నేషనల్ లా స్కూల్ యూనివర్శిటీకి చెందిన నేపాలి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో నగర పోలీసులు ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. శనివారం నగర పోలీసు కమిషనర్ వివరాలు వెల్లడించారు. నలుగురిని శుక్రవారం మధ్యాహ్నం, ముగ్గురిని ఆ తర్వాత అరెస్టు చేసినట్లు చెప్పారు.