పవన్ కళ్యాణ్కు చెడ్డ పేరు వస్తుంది: తమ్మారెడ్డి
సున్నితమైన అంశాలపై చిత్రాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు లోతుగా ఆలోచించాలని ఆయన సూచించారు. కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నైజాం పంపిణీదారు దిల్ రాజు కార్యాలయాలపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదంపై మాట్లాడారు.
కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదానికి చిత్ర నిర్మాత దానయ్య తెర దించారు. తెలంగాణ నాయకులు, ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు అభ్యంతరకర సన్నివేశాలను, సంభాషణలను పూర్తిగా తొలగించినట్లు ఆయన సోమవారం చెప్పారు.
ఈ రోజు నుంచి వివాదాంసాలు లేకుండానే అన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సినిమాను నిర్మించలేదని, సదుద్దేశంతోనే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను పూరీ జగన్నాథ్ అందించారని అన్నారు.