పురంధేశ్వరికి పగ్గాలు:నోచెప్పిన సింగ్, చిరుకు టూరిజమే
అయితే అందుకు మన్మోహన్ సింగ్ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆమె మానవవనరుల శాఖకు సహాయమంత్రిగా ఉన్నారు. ఈసారి ఆమెకు సదరు శాఖకు మంత్రిగా చేయాలని మన్మోహన్ సింగ్ భావిస్తున్నారట. ఆమె సామర్థ్యాన్ని గుర్తించిన మన్మోహన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
కేంద్రమంత్రి పల్లంరాజు అంశంపై కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించేందుకు ప్రధాని ఓకే చెప్పారని సమాచారం. తెలంగాణ నుండి సర్వే సత్యనారాయణ, వి హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సర్వే, విహెచ్లకు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం.
కేంద్రంలో యువతకే పెద్ద పీట వేయాలని అందరూ భావిస్తున్నారు. రాహుల్ గాంధీ జట్టుకు పెద్ద పీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సహాయమంత్రిగా ఉన్న పలువురు యువనేతలను మంత్రులుగా ప్రమోట్ చేయనున్నారని సమాచారం. బేణి ప్రసాద్ వర్మ తదితరులకు ఉద్వాసన పలకనున్నట్లుగా తెలుస్తోంది.