బి రెడీ: ఎంపి కోట్లకు అధిష్టానం ఫోన్: చిరంజీవికి కూడా
మన రాష్ట్రం నుండి పలువురి పేర్లు వినిపించాయి. అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని అందుబాటులో ఉండమని వర్తమానం రావడంతో ఆయనకు బెర్త్ ఖాయమైనట్లేనని చెప్పవచ్చు. చిరంజీవికి ఫోన్ రావడంతో పాటు.. తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సమయంలోనే ఆయనకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఇక తెలంగాణ నుండి ఇద్దరికి ఇచ్చే అవకాశముందనే వార్తలు వచ్చాయి. అయితే మల్కాజిగిరి ఎంపి సర్వే సత్యనారాయణకు మాత్రమే అవకాశం దక్కినట్లుగా తెలుస్తోంది.
వి హనుమంత రావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ తెలంగాణ నుండి ఒక్కరికే ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపిందని తెలుస్తోంది. అవకాశం సర్వేకు దక్కిందని ఢిల్లీలో చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు సహాయమంత్రుల్లో ఒకరికి మంత్రిగా ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. అది మానవవనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుపాటి పురేంధేశ్వరియే కావచ్చునని సమాచారం.