నా వల్లే ఆమెకు మంత్రి పదవి రాలేదు: బొత్స
ఏ శాఖ అప్పగించినా ఎస్ జైపాల్ రెడ్డి సమర్థంగా నిర్వహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. జైపాల్ రెడ్డి శాఖ మార్పు ప్రమోషనో, డిమోషనో తనకు తెలియదని బొత్స అన్నారు. ఏ ఒక్కరి వల్ల ప్రభుత్వం, పార్టీ నడవవని కేంద్ర మంత్రి చిరంజీవిపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా అన్నారు. సున్నా పక్కన ఒక్కటి ఉంటేనే విలువ అని, అందరూ కలిసి ఉంటేనే పార్టీకి బలమని ఆయన అన్నారు. ఎవరు నాయకత్వం వహించినా అందరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని అన్నారు.
అవకాశం వస్తే చిరంజీవి పార్టీకి నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే శానససభ్యులు పార్టీ మారుతున్నారని చింతలపూడి శానససభ్యుడు మద్దాల రాజేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంపై అన్నారు. మరి కొంత మంది వెళ్లినా తమ ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని దీమా వ్యక్తం చేశారు. అవసరమనుకుంటే రాష్ట్రంలో కూడా మార్పులు చేస్తామని ఆయన చెప్పారు
రాజీనామా ఉపసంహరించుకోవాలని తాము ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావును కోరినట్లు ఆయన తెలిపారు. కావూరి మంత్రి పదవిని కోరుకోవడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. కావూరి సేవలను పార్టీకి వాడుకుంటామని చెప్పారు. పార్టీలో పనిచేసే వారికే పదవులు లభిస్తాయని ఆయన అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో మరి కొంత మంది బిసీలకు స్థానం కల్పించాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర మంత్రివర్గంలో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చేరితే బాగుండేదని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర మంత్రులు పనిచేయాలని అన్నారు. మంత్రులుగా అందరికీ అవకాశం రాదని, చిన్నపాటి అసంతృప్తులు సహజమేనని అన్నారు.