వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు కరుణానిధి లేఖ: ఆరోగ్యంపై సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: వస్తున్నా.. మీకోసం పేర పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి లేఖ రాశారు. పాదయాత్ర నేపథ్యంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడో రోజుకు చేరుకుంది. చింతరేవులపల్లి గ్రామంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు మంచినీటి సమస్యను ప్రస్తావించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని మంజూరు చేస్తామని చెప్పారు

తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను పూర్తిగా మూసివేస్తామని, ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. ఆదరణ పథకం ద్వారా వృత్తిదారులకు పనిముట్లు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఏంలోన్ గ్రామం చేరుకున్నారు. వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. పాదయాత్రలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వర రావు మద్దతు తెలిపారు.

గద్వాలలో సభా వేదిక కూలిపోవడంతో చంద్రబాబు వెన్నుకు స్వల్పంగా గాయమైన విషయం తెలిసిందే. నొప్పి ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదివారంనాడు పాదయాత్ర సాగించారు. ఈ నేపథ్యంలో కరుణానిధి చంద్రబాబుకు లేఖ రాశారు.

English summary
Tamil nadu former CM and DMK chief Karuna Nidhi has a written letter to Telugudesan president N Chandrababu Naidu, who is in padayatra in Mahaboobnagar district. Karuna Nidhi gave suggestion to Chandrababu about health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X