చంద్రబాబుకు కరుణానిధి లేఖ: ఆరోగ్యంపై సలహా
తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదవారికి లక్ష రూపాయలు ఖర్చు చేసి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి అండగా ఉండేందుకే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు మంచినీటి సమస్యను ప్రస్తావించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మంచినీటి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని మంజూరు చేస్తామని చెప్పారు
తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులను పూర్తిగా మూసివేస్తామని, ఆదరణ పథకాన్ని మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. ఆదరణ పథకం ద్వారా వృత్తిదారులకు పనిముట్లు సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఏంలోన్ గ్రామం చేరుకున్నారు. వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. పాదయాత్రలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వర రావు మద్దతు తెలిపారు.
గద్వాలలో సభా వేదిక కూలిపోవడంతో చంద్రబాబు వెన్నుకు స్వల్పంగా గాయమైన విషయం తెలిసిందే. నొప్పి ఉన్నప్పటికీ చంద్రబాబు ఆదివారంనాడు పాదయాత్ర సాగించారు. ఈ నేపథ్యంలో కరుణానిధి చంద్రబాబుకు లేఖ రాశారు.