వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు కంట కన్నీరు: కుప్పకూలిన ఎర్రన్నాయుడి కొడుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
శ్రీకాకుళం: పార్టీ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతదేహాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కంట కన్నీరు వచ్చింది. ఎప్పుడు గంభీరంగానో, ముభావంగానో కనిపించే చంద్రబాబు విగత జీవిగా పడి ఉన్న ఎర్రన్నాయుడి మృతదేహాన్ని చూసి కన్నీరు కార్చారు.

చంద్రబాబు సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్‌తో కలిసి నిమ్మాడకు చేరుకున్నారు. చంద్రబాబునాయుడు రావడంతోనే ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ సభ్యుల రోదన చూసి బాబు తట్టుకోలేక పోయారు. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరిలు ఎర్రన్నాయుడి మృతదేహానికి నివాళులు అర్పించారు.

లండన్ నుండి వచ్చిన ఎర్రన్నాయుడి తనయుడు రామ్మోహన్ నాయుడు చంద్రబాబు కారులోనే నిమ్మాడకు చేరుకున్నారు. తండ్రి మృతదేహాన్ని చూసిన రామ్మోహన్ అక్కడే కుప్పకూలిపోయారు. తమ ప్రియతమ నేత ఎర్రన్నాయుడిని చూసేందుకు అభిమానులు, టిడిపి కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. కడసారి చూపైనా చూద్దామని పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుండి తరలి వస్తున్నారు. కాగా రామ్మోహన నాయుడిని తన కారులో తీసుకు వచ్చిన చంద్రబాబు అతను వచ్చే వరకు కుటుంబ సభ్యులతో పాటు విమానాశ్రయంలో కొద్దిసేపు నిరీక్షించారు.

English summary
Telugudesam Party cheif Nara Chandrababu Naidu wept after seeing Errannaidu's dead body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X