బొత్స కూతురు పెళ్లికి కెసిఆర్ నో: ఈటెల, హరీష్ రెడీ
పార్టీలో చర్చించిన తర్వాత ఆయన వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. కానీ అనుకోకుండా ఆయన గురువారం కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు హాజరు కానున్నారు.
వీరు విమాన మార్గంలో లేదా రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. బొత్స కూతురు పెళ్లికి కాంగ్రెసు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కొందరు శుక్రవారం ఉదయం బయలుదేరనున్నారు. కాగా బొత్స కుమార్తె పెళ్లికి వచ్చే ప్రముఖులవి అధికారిక పర్యటనలా అంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మాజీ ఏఐఎస్ ఒకరు లేఖ రాశారు.
బొత్స కుమార్తె వివాహానికి హాజరయ్యే ముఖ్య అతిథులు పర్యటన పేరుతో పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని కిరణ్కు లేఖ రాశారు. గవర్నర్, అనేకమంది మంత్రులు ఈ వివాహానికి హాజరు కానున్న నేపథ్యంలో మొత్తం పర్యటనలను అధికారిక ఖర్చుగా చూపడాన్ని ఆయన ప్రశ్నించారు.