వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎర్రన్న మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు: 'శిల్ప' నివాళి
దీనికి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కమిషన్ డిసెంబర్ 12 లోగా నివేదిక సమర్పించాలని శ్రీకాకుళం జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. జిల్లా వైద్యాధికారి, నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్లకు కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఎర్రన్నాయుడు శిల్పం
రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు శిల్పాన్ని పశ్చిమ గోదావరి జిల్లా శిల్పులు చెక్కారు. ఎర్రన్నాయుడు శిల్పాన్ని జీవం ఉట్టిపడేలా మలిచారు. అరుణ ప్రసాద్, కరుణాకర్ అనే శిల్పులు ఎర్రన్నాయుడి శిల్పాన్ని చెక్కారు. దీనిని ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని వారు తెలియజేశారు.
Comments
English summary
A Right activist knocked at the door of the State Human Rights Commission(HRC) seeking action against those responsible for the tragic death of TDP senior leader Errannaidu.
Story first published: Sunday, November 4, 2012, 11:39 [IST]