జగన్కు ఓర్పులేదు, మీడియా అతిగా చూపిస్తోంది: కోట్ల
వైయస్ జగన్కు ఓర్పు లేదన్నారు. ఆయన బలమైన శక్తేమీ కాదని, కేవలం సానుభూతి వల్లనే ఆయన ఉప ఎన్నికల్లో గెలుపొందారన్నారు. ఆ సానుభూతి ఎక్కువ కాలం ఉండదని, 2014లో కాంగ్రెసు పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పని చేసినట్లుగా సానుభూతి ఏమాత్రం పని చేయదన్నారు. రాష్ట్రంలో తిరిగి కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వస్తామన్నారు.
ఇందుకోసం రాష్ట్రంలో అందరి నేతలతో కలిసి వెళ్తామన్నారు. రాజకీయాల్లో ఓర్పు లేకుంటే చాలా కష్టమన్నారు. ఆలస్యమైనప్పటికీ తాను ఓర్పుతో ఉండటం వల్లనే తనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందన్నారు. జగన్కు అవి లేవన్నారు. ముఖ్యమంత్రి పదవి అప్పుడే కావాలని పట్టుబట్టారని, వేచి ఉంటే ఆయనకు కూడా పదవి వచ్చేదన్నారు.
రాష్ట్రానికి కాంగ్రెసు తరఫున పదిహేడేళ్ల తర్వాత రైల్వే మంత్రి పదవి దక్కిందన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 39 పనులకు పది పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కాగా హైదరాబాద్ వచ్చిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గవర్నర్ నరసింహన్ను కలిశారు.