తుఫానువల్ల 25 మంది మృతి, నేడూ వర్షం: రఘువీరా
అంతకుముందు రఘువీరా రెడ్డి నీలం తుఫాను ప్రభావంపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్షించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. నష్టం అంచనాపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా సూచించారు.
ముఖ్యమంత్రి సమీక్ష
తుఫానుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి పదిమంది మంత్రులు హాజరయ్యారు. బొత్స సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, సుదర్శన్ రెడ్డి, టిజి వెంకటేష్, డొక్కా మాణిక్య వర ప్రసాద్, శ్రీధర్ బాబు, శత్రుచర్ల విజయ రామరాజు, ఏరాసు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.
కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఏరియల్ సర్వే చేసే అవకాశముంది. కాగా వరంగల్ జిల్లాలో వర్షాల కారణంగా పంట బాగా నీట మునిగింది. తెలుగుదేశం పార్టీ నేతలు, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.