వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

10 జన్‌పథ్ వద్ద టి-నేతల హంగామా: ఎదురుచూపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నివాసం వద్ద సోమవారం హడావుడి కనిపించింది. ఆదివారం రాంలీలా మైదానంలో కాంగ్రెసు ప్రజా సదస్సు సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభకు మన రాష్ట్రం నుండి కాంగ్రెసు పార్టీ నేతలు చాలామంది వెళ్లారు. సభ తర్వాత కొందరు తిరిగి వచ్చినప్పటికీ చాలామంది నేతలు అక్కడే ఉండిపోయారు.

సోనియా దర్శనం కోసం మన నేతలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. సోనియా ఇంటి వద్ద జాతరను తలపిస్తోంది. సోనియా నివాసానికి వెళ్లే రహదారులు అన్నీ కాంగ్రెసు నాయకులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు ఇరవై మందికి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

తమకు కావాల్సింది ముఖ్యమంత్రి మార్పు కాదని... తెలంగాణ రాష్ట్రం అని వారు చెబుతున్నారు. అదే విషయాన్ని తాము సోనియా గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామని చెబుతున్నారు. భారీగా నేతలు తరలి రావడంతో సోనియా గాంధీ ఇంటి వద్ద కొద్దిగా తోపులాట కూడా జరిగింది.

ఇరవై మంది ఎమ్మెల్యేలు సహా పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా సోనియా గాంధీ అపాయింటుమెంటు కోసం వేచి చూస్తున్నారు. కేంద్రమంత్రి బలరామ్ నాయక్, రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి సహా పలువురు ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో సోనియా గాంధీతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కాంగ్రెసు ఎంపీలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము ముఖ్యమంత్రి మార్పుపై సోనియా గాంధీతో చర్చించలేదని చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అంతకుముందు ఎంపీలు గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.

English summary

 Telangana Congress MPs were met AICC president Sonia Gandhi on Monday and they appealed her to take decision on Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X