వివేకానంద, దావూద్ ఐక్యూల పోలిక: చిక్కుల్లో గడ్కరీ
అయితే, గడ్కరీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్సింగ్ మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అభిమానులు ఏమైనా స్పందిస్తారా అని ట్విటర్లో ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ కూడా ఇలాగే మాట్లాడుతుందని, గడ్కరీ అక్కడి నుంచే వచ్చిందని, అందుకే ఆయన అలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. గడ్కరీ వ్యాపారవేత్త అన్నది నిజమని, ఆయన బోగస్ కంపెనీలను ఏర్పాటు చేశారన్నది నిజమన్నారు.
సంఘ్పరివార్ ఉగ్రవాద దాడులకు పాల్పడిందన్నది, అన్నా హజారే ఆందోళనకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఇచ్చిందన్నది, బాబా రామ్దేవ్ భయంకర నేరగాడు అన్నది, ఠాక్రే కుటుంబం బీహార్ నుంచి వచ్చిందన్నది, కేజ్రీవాల్కు రాజకీయ లక్ష్యాలు ఉన్నాయన్నది నిజమని, ట్విటర్లో నన్ను విమర్శించేవాళ్లు పునరాలోచించుకోవాలని సూచించారు.
వివేకానంద, దావూద్ మేధో స్థాయిని ఎలా పోల్చుతారని కాంగ్రెస్ నేత జగదంబికా పాల్ మండిపడ్డారు. ఎవరైనా గడ్కరీ ఐక్యూను, కసబ్ ఐక్యూతో పోలిస్తే బిజెపి ఏం జవాబు చెబుతుందని ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో గడ్కరీ వెంటనే స్పందించారు. తాను వివేకానందను దావూద్తో పోల్చిలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తన తెలివి తేటలను సరైన దిశలో ఉపయోగించుకుంటే స్వామి వివేకానంద అవుతారని, అడ్డదారులు తొక్కితే దావూద్ ఇబ్రహిం అవుతారని చెప్పానని వివరించారు.