మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే: మందకృష్ణ
మోహన్బాబు కుటుంబం కావాలనే ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణుల పోరాటం న్యాయసమ్మతమైందన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వరుసగా సినిమాలు వస్తుంటే.. సెన్సార్ బోర్డు ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన బ్రాహ్మణులను గుండాలు తీవ్రంగా కొట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.
మోహన్బాబు తన వైఖరి మార్చుకుని క్షమాపణ చెప్పకుంటే ఇంటి నుంచి బయటకురాని పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని మందకృష్ణ హెచ్చరించారు. దేనికైనా రెడీ సినిమాపై మోహన్ బాబుకు వ్యతిరేకంగా బ్రాహ్మణులు వివిధ వర్గాల మద్దతు కూడగడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కూడా వారు ఆ సినిమాపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, దేనికైనా రెడీ సినిమాపై ప్రభుత్వం వేసిన కమిటీపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మోహన్ బాబుకు కాస్తా ఊరట లభించినట్లయింది. అయితే, ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వెంటనే పిటిషన్ దాఖలైంది. దేనకైనా రెడీ సినిమమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని ఆ పిటిషన్లో కోరారు.