శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారసుడిపై నిర్ణయం: బాలకృష్ణ, వెంట లోకేష్, రోహిత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna-Nara Lokesh
శ్రీకాకుళం: ఎర్రన్నాయుడి వారసుడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ బుధవారం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో ఇటీవల మృతి చెందిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడి సంస్మరణ సభలో బాలకృష్ణ, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, హీరో నారా రోహిత్ పాల్గొన్నారు. బాలకృష్ణ, రోహిత్, లోకేష్‌లు ఎర్రన్నాయుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. ఎర్రన్న నిస్వార్థ రాజకీయాలకు మారుపేరు అన్నారు. ఆయన వారసుడిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్టీ బలోపేతానికి ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు కృషి చేయాలని బాలకృష్ణ కోరారు. ఎర్రన్నాయుడి మృతి తెలుగుదేశం పార్టీకి, తెలుగు ప్రజలకు ఎంతో లోటు అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.

అంతకుముందు హైదరాబాద్ నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ... ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని బాలకృష్ణకు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరి తదితరులు ఉన్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం.. నామా, కడియం

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరిలు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అస్థిరత్వంలో ఉన్నాయన్నారు. కిరణ్ విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవకాశముందన్నారు. గవర్నర్ ప్రత్యేక సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

English summary
Hero Nandamuri Balakrishna said they will announce heir of Yerram Naidu soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X