21.48 మిలియన్ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం
ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రానికి, వర్ణరహిత వజ్రం క్యారట్కు పలికే ధరల విషయంలో ఇదే రికార్డు. క్రిస్టీ అంతర్జాతీయ ఆభరణాల శాఖ డైరెక్టర్ ఫ్రాంకియోస్ కూరీల్ ఈ విషయం చెప్పారు. ఈ గోల్కొండ వజ్రం ఆస్టియాకు చెందిన అర్చుడుకే జోసెఫ్ ఆగస్టుకు చెందింది. అతను 1962లో మరణించాడు. ఈ వజ్రాన్ని 1933లో ఆస్ట్రియా రాకుమారుడు హంగేరీ జనరల్ క్రెడిట్ బ్యాంక్ వాల్ట్లో డిపాజిట్ చేశాడు.
మూడేళ్ల తర్వాత దాన్ని ఓ ఐరోపా బ్యాంకర్కు విక్రయించారు. అప్పటి నుంచి అది ఫ్రాన్స్లో సేఫ్ డిపాజిట్ బాక్సులో ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అది ఎవరి కంటపడకపోవడం అదృష్టమని క్రిస్టీ అన్నారు. ఆ వజ్రాన్నిి 1961 ఒకసారి, 1993లో మరోసారి వేలం వేశారు. మళ్లీ ఇప్పుడు క్రిస్టీ దాన్ని వేలం వేశారు. ఈ వజ్రం భారీ స్ట్రా బెర్రీ సైజులో ఉంది.
మంగళవారంనాడు మొదటి బిడ్ 8 మిలియన్ల స్విస్ ఫ్రాన్స్లు పలికింది. కొద్దిసేపట్లోనే బిడ్ సొమ్ము పెరుగుతూ పోయింది. టెలిఫోన్ ద్వారా ఓ వ్యక్తి 20.355 స్విస్ ఫ్రాన్స్లకు ఓ వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నాడు. అతను తన పేరు వెల్లడించడానికి నిరాకరించాడు. కోహినూర్ వజ్రంతో పోల్చదగ్గ వజ్రం ఇది అని అమెరికా, స్విట్టర్లాండ్ల్లో క్రిస్టీ ఆభరణాల అధిపతి రాహుల్ కడాకియా అన్నారు.