మజ్లిస్కు మద్దతుగా గోనే ప్రకాశ్: మండిపడిన కిషన్రెడ్డి
హైదరాబాదులో చాలాచోట్ల మైనార్టీ ఓట్లతోనే కాంగ్రెసు పార్టీ గడిచిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. అదే సమయంలో కాంగ్రెసు మద్దతు లేకుండానే మజ్లిస్ విజయం సాధించిందన్నారు. అటువంటింది ఇప్పుడు కాంగ్రెసు పార్టీ మజ్లిస్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు.
మరోవైపు మజ్లిస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ రాష్ట్ర అజెండాతో పని చేస్తోందని విమర్శించారు. పాతబస్తీలో చేసిన గూండాయిజాన్ని మజ్లిస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇతర ముస్లింలను ఎదగకుండా మజ్లిస్ కుట్ర చేస్తోందన్నారు. ఆ పార్టీ దౌర్జన్యాలను బిజెపియే నిలదీస్తోందన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో రాజకీయ పక్షాలు ఎందుకు స్పందించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకున్నా నగర మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదో చెప్పాలన్నారు.