వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లిస్‌కు మద్దతుగా గోనే ప్రకాశ్: మండిపడిన కిషన్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy - Gone Prakash Rao
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ వ్యవహారంలో కాంగ్రెసు పార్టీది అవకాశవాదమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు గురువారం అన్నారు. ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడారు. దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సహా కాంగ్రెసు పార్టీ అధిష్టానం అనేకసార్లు మజ్లిస్ పార్టీ మద్దతు కోరిందని గుర్తు చేశారు.

హైదరాబాదులో చాలాచోట్ల మైనార్టీ ఓట్లతోనే కాంగ్రెసు పార్టీ గడిచిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. అదే సమయంలో కాంగ్రెసు మద్దతు లేకుండానే మజ్లిస్ విజయం సాధించిందన్నారు. అటువంటింది ఇప్పుడు కాంగ్రెసు పార్టీ మజ్లిస్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు.

మరోవైపు మజ్లిస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ రాష్ట్ర అజెండాతో పని చేస్తోందని విమర్శించారు. పాతబస్తీలో చేసిన గూండాయిజాన్ని మజ్లిస్ రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇతర ముస్లింలను ఎదగకుండా మజ్లిస్ కుట్ర చేస్తోందన్నారు. ఆ పార్టీ దౌర్జన్యాలను బిజెపియే నిలదీస్తోందన్నారు. భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో రాజకీయ పక్షాలు ఎందుకు స్పందించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకున్నా నగర మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదో చెప్పాలన్నారు.

English summary
YSR Congress party leader Gone Prakash Rao has supported MIM party and lashed out at Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X