వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో లోకేష్, భువనేశ్వరి: చెట్టు కింద భోజనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu yatra enters in to Medak
కర్నూలు/మెదక్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆదివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో ముగిసి.. మెదక్ జిల్లాలో ప్రవేశించింది. పటాన్‌చెరువు మండలంలోని బిడిఎల్ గేటు వద్ద బాబు యాత్ర మెదక్ జిల్లాలో ప్రవేశించింది. ఈ రోజు చంద్రబాబు పాదయాత్రలో ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, సోదరి హైమావతి, రామకృష్ణ భార్య జయశ్రీ, ఉమామహేశ్వరి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్ర ఈ రోజు 49వ రోజు. బాబు యాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొనడం గమనార్హం. అంతకుముందు బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో ఓ చెట్టు కింద భోజనం చేశారు. నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇలాగే చైతన్య రథంపై తిరిగారు. బాబు పాదయాత్రతో తెలుగుదేశం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. భువనేశ్వరి, లోకేష్, ఇతర కుటుంబ సభ్యులు ఉదయం నుండే బాబుతో కలిసి పాల్గొన్నారు.

మరోవైపు కర్నూలు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజల కోసం పని చేసే సమర్థతం లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పదవిలో కొనసాగే అర్హత లేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని, అవిశ్వాసంపై ఆయన పెదవి ఎందుకు విప్పడం లేదని ప్రశ్నించారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu Vastunna Meekosam padayatra was entered in to Medak district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X