నీలం తర్వాత ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు
ఇది క్రమంగా తుఫానుగా మారే అవకాశముందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడ్డదని, మరో తుఫాను వచ్చే అవకాశముందని చెప్పారు. మరో 48 గంటలు దీని ప్రభావం ఉంటుందని, సాయంత్రానికి వాయుగుండం తుఫానుగా మారే అవకాశముందని చెప్పారు.
వాయుగుండం సోమవారం తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బుధవారం నాటికి తుఫాను బలహీనపడుతుంది. మరో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో వచ్చే రెండు రోజుల్లో సముద్రంలో చేపలు పట్టడాన్ని అధికారులు నిషేధించారు.
వేటకు వెళ్లవద్దని మత్సకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీరంలోని అన్ని పోర్టులలో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో ఈదురుగాలులు వీస్తున్నాయి. విశాఖ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. అన్ని జిల్లాల్లోని చలి పంజా విసురుతోంది.