వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, బొత్స అసమర్థులు: సోనియాకు కేంద్రమంత్రి లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy and Botsa Satyanarayana
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు అసమర్థులు అని ఆరోపిస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి కిషోర్ చంద్ర దేవ్ లేఖ రాసినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. కిషోర్ చంద్ర దేవ్ తన లేఖలో బొత్స, కిరణ్‌లపై తీవ్రమైన విమర్శలు చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్ ఓ అసమర్థ నేత అని లేఖలో పేర్కొన్నారు.

బొత్సను కూడా అసమర్థ నేతగా పేర్కొంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయనను లిక్కర్ డాన్, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అంటూ పేర్కొన్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌ను, పిసిసి చీఫ్‌గా బొత్సను వెంటనే తప్పించాలని ఆయన తన లేఖలో సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది.

వారిని తొలగిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలపడుతుందని లేదంటే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారని సమాచారం. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వారి స్థానంలో పగ్గాలను ఇతరులకు అప్పగించాలని సూచించారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే నాయకత్వ మార్పులపై జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో కిషోర్ చంద్ర దేవ్ లేఖ కలకలం రేపుతోంది.

అయితే ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్‌లకు వ్యతిరేకంగా తాను ఎలాంటి లేఖ రాయలేదని కిషోర్ చంద్రదేవ్ చెబుతున్నారు.

English summary
Central Minister Kishore Chandra dev has wrote a letter to AICC president Sonia Gandhi that there is no use with CM Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X