నాపై రాజకీయ కుట్ర, నన్ను మారిస్తే ఏం కాదు: బొత్స
ఆ లేఖను చూడలేదన్నారు. తనకు తెలిసి అవన్నీ ఊహాజనిత కథనాలే అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. కొందరు కుట్రపూరితంగా పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ సమైక్యతను కాపాడగలిగేది కేవలం కాంగ్రెసు పార్టీ మాత్రమే అన్నారు.
కిషోర్ చంద్రదేవ్ లేఖ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనను మాఫియా డాన్తో పోల్చిన పత్రికపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. తన కూతురు వివాహాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాంధీ భవనంలో కెవిపి రామచంద్ర రావుతో బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.
కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్లకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసి ఉంటారని తాను భావించడం లేదని మంత్రి కొండ్రు మురళీ మోహన్ అన్నారు. 2014 వరకు ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తాము 174 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరో రెండు వైద్య కళాశాలలు వచ్చాయని చెప్పారు.