వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మద్దతిస్తేనే ప్రధాని, చక్రం తిప్పుతారు: నల్లపురెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasanna Kumar Reddy
కర్నూలు: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గురువారం అన్నారు. కర్నూలు జిల్లాలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీ 225 అసెంబ్లీ స్థానాలను, 35 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

రానున్న రోజులు అన్నీ వైయస్సార్ కాంగ్రెసువే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో తమ పార్టీ చక్రం తిప్పుతుందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన వ్యక్తే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డ్రామాలను ఎవరూ నమ్మడం లేదన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

కాగా వైయస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రవేశించనుంది. కర్నూలు జిల్లా నుంచి తుంగభద్ర బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించనుంది. ఆ తర్వాత పుల్లూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. యాత్రలో కార్యకర్తలు షర్మిలకు సమస్యలు తెలియజేయాలని, పూలు చల్లడం వంటివి చేయవద్దని నేతలు సూచించారు.

English summary
SPS Nellore district Kovvur YSR Congress Party MLA Nallapureddy Prasanna Kumar Reddy said party chief YS Jaganmohan Reddy will play key role in cenral government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X