కేజ్రీవాల్ పార్టీ పేరు ఆమ్ ఆద్మీ: నో హైకమాండ్
"నేను ఆమ్ ఆద్మీని. నేను స్వరాజ్ తెస్తాను. నేను లోక్పాల్ బిల్లు రూపొందిస్తాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 26వ తేదీ సోమవారంనాడు తనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలవాలని ఆయన ప్రజలను కోరారు. దయచేసి, 26న రావాలని, ఆ రోజు సభ్యులుగా చేరే వారంతా పార్టీ వ్యవస్థాపక సభ్యులవుతారని ఆయన అన్నారు.
కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్ తదితరులు సమావేశమై పార్టీ పేరును, పార్టీ గుర్తును ఖరారు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడి సామాన్యుడి చేతిలో ప్రజాస్వామ్య శక్తిని పెడతామని కేజ్రీవాల్ అన్నారు.
పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీకి అధిష్టానమంటూ ఏదీ ఉండదు. ఒక కుటుంబ ఆధిపత్యం పార్టీపై ఉండదు. అంతర్గత లోక్పాల్ ఉంటుంది. నిర్మాణంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అత్యంత ప్రగతిశీలమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుంది.
పార్టీని నడిపించడానికి జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. 30 మందితో జాతీయ కార్యవర్గం ఉంటుంది. పార్టీ కోసం ప్రత్యేక నిబంధనావళిని రూపొందిస్తారు. ప్రజలు నేతలతో విసిగిపోయినందున పార్టీలో నేతలెవరూ ఉండరు.