బాధలో కాకుండా ఇంకెప్పుడు: కిరణ్ రెడ్డికి డిఎల్ లేఖ
అలా చేస్తే తాను నేరుగా గవర్నర్ నరసింహన్ను కలిసి తన అభ్యంతరాలను తెలియజేస్తానని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై సిఎస్ ఫోన్లో సంప్రదిస్తే తనకు అభ్యంతరాలు ఉన్నట్లు డిఎల్ చెప్పారు. ముఖ్యమంత్రికి పంపిన లేఖలో ధర్మాన అంశం ఒక్కటే కాకుండా పలు అంశాలను ప్రస్తావించారట. ప్రజలు కరువు, వరదల లాంటి బాధల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోకుంటే ఏం లాభమని సిఎం కిరణ్ను ప్రశ్నిస్తూ డిఎల్ ఆ లేఖ రాశారట.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లుగా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికా నిధులకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నందుకు సిఎంను డిఎల్ అభినందించారట. అదే సమయంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలని, 18 జిల్లాల్లో అకాల వర్షాలతో పంట నీటిపాలై రైతులు నిండా మునిగిపోయారని, కష్టాల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలని సూచించారట.
రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే కరువు, వరదలతో నష్టపోయిన రైతుల గురించి, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి చర్చించాలని చెప్పారట. ఇన్పుట్ సబ్సిడీని పెంచాలని సూచించారని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్లపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇచ్చిన తొమ్మిది సిలిండర్ల హామీని అమల తక్షణమే అమలు చేయాలని సూచించారట.