జగన్పార్టీలో కర్చీఫ్, వెళ్లు అంతేకానీ: పెద్దిరెడ్డిపై వీరశివా
కాంగ్రెసు పార్టీలో ఉండి కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో కర్చీప్ వేసుకుంటూ సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికే పలువురు తమ వారసులను ఆ పార్టీలోకి పంపించి రిజర్వ్ చేసుకున్నారన్నారు. అలాంటి వారిలో పెద్దిరెడ్డి కూడా ఒకరు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చునని, కానీ కాంగ్రెసుపై విమర్శలు చేస్తూ వెళ్లడం సరికాదన్నారు.
గత శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బి ఫారం ఇచ్చిన వ్యక్తిని పెద్దిరెడ్డి ఓడించారన్నారు. కాంగ్రెసును నాశనం చేసేందుకు డ్రామాలు ఆడితే ఊరుకునేది లేదన్నారు. పెద్దిరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పుంగనూరుకు నిధులు, పనులు కిరణ్ అడ్డుకున్నారని పెద్దిరెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ముఖ్యమంత్రిని మార్చితేనే ఉంటానని పెద్దిరెడ్డి పార్టీ అధిష్టానాన్ని, సోనియా గాంధీని హెచ్చరించినట్లుగా మాట్లాడటం శోచనీయం అన్నారు. కొందరు సీనియర్ నేతలు తమ వారసులను జగన్ పార్టీలోకి పంపి కాంగ్రెసు పార్టీని ఉద్దేశ్య పూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు.
పార్టీలో చర్చించాలి
ముఖ్యమంత్రిపై పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని సిఎల్పీ సోనియా గాంధీకి అప్పగించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏవైనా అభిప్రాయాలు ఉంటే పార్టీలో చర్చించాలని ఇలా బయటపడటం సరికాదన్నారు. సిఎల్పీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాతే సోనియాకు బాధ్యత అప్పగించామన్నారు. పెద్దిరెడ్డి వ్యవహారం అధిష్టానం చూసుకుంటుందన్నారు.