హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నార్వే గొడవ: తెలుగు దంపతులకు జైలు శిక్ష ఖరారు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Norway child row: Court delivers judgement
ఓస్లో: కుమారుడిని హింసించారనే ఆరోపణలపై తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. చంద్రశేఖర్‌, అనుపమ దంపతులకు జైలు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చంద్రశేఖర్‌కు 18 నెలలు, అనుపమకు 15 నెలలు జైలు శిక్ష ఖరారు చేసింది.
పిల్లలను మందలించారనే ఆరోపణలతో జైలు పాలైన నార్వేలోని తెలుగు దంపతుల కేసు కొత్త మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఆ దంపతులు తమ కుమారుడి ఒంటిని కాల్చారని పోలీసులు ఆరోపించారు.

వారు తమ ఏడేళ్ల కుమారుడికి వారు వాతలు పెట్టినట్లు పోలీసులు ఆరోపించారు. పిల్లవాడి ఒంటిపై కాల్చిన మరకలు, మచ్చలు ఉన్నాయని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ ఆరోపించారు. కాల్పిన లోహంతో వాతలు పెట్టారని ఆ తెలుగు దంపతులు ఆరోపణలు ఎదుర్కుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే, ఆ ఆరోపణలను తెలుగు దంపతులు చంద్రశేఖర్ వల్లభనేని, అనుపమ ఖండించారు. పిల్లలను వారు బాధించలేదని, పిల్లవాడి పట్ల సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు గానీ బాధించలేదని, సహాయం కోసం వారు చూశారని, కానీ అది లభించలేదని అనుపమ తరఫు న్యాయవాది మార్టే బ్రోట్రోమ్ కోర్టు తీర్పునకు ముందు అన్నారు.

దంపతులను నార్వేలోని జైలులో పెట్టడం తప్పు అని ఆమె అన్నారు. కోర్టు వారికి శిక్ష వేస్తే తాము అపీల్ చేస్తామని ఆమె అన్నారు. పిల్లవాడు పాఠశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది నెలల తర్వాత పోలీసులు చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. కొడుకుని మందలించిన కేసులో తల్లి అనుపమకు 15 నెలలు, తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది.

English summary
Even as an Oslo court on Tuesday has delivered its judgement in the case of an Indian couple arrested for allegedly abusing their child, the Norway police claimed that they burnt and hit their seven-year-old son, reports said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X