వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక గాంధీ, బృందాకారత్ అవయవదానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంకా గాంధీ వాద్రా అవయవ దానానికి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ఓ ఆసుపత్రి వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నిర్వాహకులు అవయవదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీ మరణానంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు తెలిపారు.

Priyanka Gandhi-Brinda Karat

అయితే ఆమె స్వయంగా రాలేదు. సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) రూపంలో ఆమె ఆసుపత్రి వర్గాలకు పంపారు. అవయవదాతల జాబితాలో తన పేరును కూడా చేర్చాలని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు. ఈ సంకల్పానికి ఉపయోగపడుతుందని భావిస్తే తన పేరును కూడా అవయవదాతల పేర్ల జాబితాలో చేర్చాలని, తన పేరును ప్రకటించవచ్చునని, ఈ కార్యక్రమంలో స్వయంగా హాజరవ్వాలని భావించానని, కానీ కుదర లేదని సందేశంలో పేర్కొన్నారు.

ప్రియాంక వాద్రా గాంధీ తన ఇద్దరు పిల్లలకు ఇదే ఆసుపత్రిలో జన్మనిచ్చారు. సిపిఎం(కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్ట్) నాయకురాలు బృందాకారత్ కూడా అవయవదానానికి ముందుకు వచ్చారు. అవయవదాన సంకల్పానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని ఆమె చెప్పారు. తాను కూడా అవయవదానం చేస్తానని ఆసుపత్రి వర్గాలకు బృందాకారత్ చెప్పారు. ఈ అవయవదాన ప్రతినలో సుమారు 500 మంది ప్రతినబూనారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

English summary
Priyanka Gandhi Vadra and Brinda Karat were among the 500-odd people from different walks of life who pledged to donate their organs at an event organized by a Delhi hospital on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X