రాజకీయాల్ని ద్వేషించొద్దు: జెపి, కెటిఆర్ సంఘీభావం
పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు, కాంగ్రెసు నేత తులసి రెడ్డి, సిపిఎం, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, బిజెపి.. ఇలా అన్ని పార్టీల నేతలు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారన్నారు. మంచి చదువు లేనంత కాలం రాజ్యాంగం చిత్తు కాగితమే అన్నారు. జనం చేతికి అధికారం వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. రాజకీయాలను పట్టించుకోకుండా ఉండటం సరికాదన్నారు. వాటికి పరిష్కార మార్గం చూపించాలన్నారు.
కులం, మతం, డబ్బు పేరిట వివక్ష లేకుండా అందరికీ ఎదిగే అవకాశాలు కల్పించేందుకు మంచి విద్యను అందించాలన్నారు. సురాజ్య లక్ష్యాలకు ఎలాంటి బేధమూ లేదన్నారు. మంచి విద్యను అందించాలని అంబేద్కర్ సైతం చెప్పారన్నారు. దీనిపై పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఇప్పటిదాకా జరిగిన ఏ ఎన్నికల్లోనైనా చర్చ జరిగిందా అని ప్రశ్నించారు.
తమ బిడ్డలకు మెరుగైన భవిష్యత్తు, మంచి చదువుల కోసం ప్రతి తల్లీ తండ్రీ కోసం పోరాడాలని, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా సరే డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. సురాజ్యం కోసం అందరూ కలిసి రావాలని జెపి పిలుపునిచ్చారు.