వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమయమొస్తే దోపిడీ దొంగలకు బుద్ధి చెప్పాలి: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
మహబూబ్‌నగర్: సమయం వచ్చినప్పుడు దోపిడీ దొంగలకు తగిన బుద్ధి చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల శనివారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల పాదయాత్ర 52వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

వారి కుమ్మక్కు రాజకీయాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ప్రజల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జగన్‌తోనే రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం సుసాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో రైతులను పీక్కుతున్నారని, ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ఉందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఏ ఛార్జీలు పెరగలేదన్నారు. ఆయన తన హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజల సంక్షేమం కోసమే పని చేశారని, పేదవారు, రైతుల కోసం అహర్నిషలు తపించే వారని షర్మిల అన్నారు. ఆయన బాటలోనే జగన్ నడుస్తారని చెప్పారు.

English summary
YSR Congress party leader Sharmila has appealed 
 
 people to avoid TDP and Congress parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X