కలచివేసిన కాల్పుల్లో మరణించిన చిన్నారి లేఖ
తన ప్రాణానికి ముంచుకొస్తున్న ముప్పును చూసి వెంటనే లేఖ రాసి పెట్టాడు. సాండీ హూక్ పాఠశాలలో ఆగంతకుడి కాల్పుల్లో మరణించేముందు స్కూల్ విద్యార్థి బ్రియాన్ రాసిన ఈ లేఖ.. అధికారులకు లభించింది. హృదయాన్ని కలిచివేసేలా ఓ చిన్నారి రాసిన లేఖ అమెరికా వాసులనే కాదు.. దేశాధ్యక్షుడు ఒబామానూ కంట తడి పెట్టించింది. పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 20 మంది పిల్లలతో పాటు మొత్తం 28 మంది మరణించిన విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే, కాల్పుల ఘటనలో మృతుల వివరాలను ఆదివారం వెల్లడించారు. చనిపోయిన చిన్నారుల్లో 12 మంది బాలికలు, 8 మంది బాలురు ఉన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ డాన్ హూచ్స్ప్రంగ్ (47), సైకాలజిస్ట్ మేరీ షెర్లాచ్ (56), టీచర్లు రాచెల్ డేవినో (29), ఆనే మేరీ మర్ఫీ (52), లారెన్ రొసేవూ (30)లు కూడా మృతుల్లో ఉన్నట్టు చెప్పారు. పిల్లలను రక్షించే క్రమంలో ప్రిన్సిపల్, సైకాలజిస్ట్లు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు.
కాగా, సాండీ హూక్ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరామర్శించారు.